News September 2, 2025

ఏలూరులో యువతి మృతి..బంధువుల ఆందోళన

image

ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి యువతి మృతి చెందిందని ఆమె బంధువులు ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. ఏలూరు తూర్పు వీధి మేకల కబేలా ప్రాంతానికి చెందిన కటారి భారతి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. వంగాయగూడెం సెంటర్లో ఆర్ఎంపీ వైద్యుడు రెండు ఇంజక్షన్లు చేశాడని, కొంతసేపటికే స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు భారతి బంధువులు తెలిపారు.

Similar News

News September 3, 2025

HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

✓ పరకాల రక్తపుటేరుకు 78 ఏళ్లు!
✓ JN: మైనర్లకు వాహనం ఇస్తే లక్ష రూపాయల జరిమానా
✓ కాజీపేట: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
✓ HNK: గంజాయి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
✓ ఆఫర్ల కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు: WGL సైబర్ పోలీస్
✓ గణేష్ మండపాల వేదికగా సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు
✓ గణేష్ శోభాయాత్రలో డీజేలపై నిషేధం: ASP

News September 3, 2025

జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

image

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్‌(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 3, 2025

KNR: ప్రభుత్వ భూములు పరిరక్షించాలి: కలెక్టర్

image

KNR రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని అనధికార కట్టడాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, రాతి కడీలు, సూచిక బోర్డులు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.