News February 28, 2026

ఏలూరు: ‘అసలు కట్టి.. వడ్డీ పట్టు’

image

ఉమ్మడి ప.గో వ్యాప్తంగా 465 మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది బకాయి ఉన్న అసలు రూ.13.55 కోట్లను చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈఈ ముక్కంటి శనివారం తెలిపారు. ఈ సొమ్ముకు వడ్డి రూ.1.66 కోట్లు ఉందన్నారు. ఏప్రిల్ 30 లోపు అసలు కడితే, వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ద్వారకా తిరుమల (M) జీ.కొతపల్లి గ్రామానికి చెందిన జొన్నకూటి వెంకటేశ్వర రావు తీసుకున్న నగదు పూర్తిగా చెల్లించడంతో సత్కరించారు.

Similar News

News March 2, 2026

చైనా ఆయుధాలు మరోసారి తుస్సు

image

చైనా డిజైన్ చేసిన ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ మరోసారి ఫెయిలయ్యాయి. వీటిని నమ్ముకునే US, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్‌ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి దెబ్బతింది. ఆ దేశం ఇచ్చిన HQ-9B డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల మిసైళ్లను ఎదుర్కోలేకపోయింది. కొన్నింటిని అసలు గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ భారీగా నష్టపోయింది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మడురో, ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో పాక్ సైతం చైనాను నమ్ముకొని దెబ్బతిన్నాయి.

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

image

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

image

మూన్ ల్యాండింగ్‌తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్‌లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.