News September 19, 2025

ఏలూరు: ఆక్వా రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం

image

ఏలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆక్వా, చేపల చెరువుల రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్ సమస్యలు, సర్ చార్జి, అడిషనల్ చార్జి, అధిక బిల్లుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. చెరువులకు అప్రోచ్ రోడ్ల నిర్మాణాల గురించి వారు ప్రస్తావించారు.

Similar News

News September 20, 2025

RRB: NTPC CBT1 ఫలితాలు విడుదల

image

NTPC-2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT1) ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. ఎంపికైన వారికి అక్టోబర్ మూడో వారంలో సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT2) నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించనుంది.

News September 20, 2025

విజయనగరంలో హైకోర్టు జడ్జిల పర్యటన

image

విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జిలను కలెక్టర్ ఎస్.రామ సుందర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News September 20, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్‌‌.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.