News July 2, 2024

ఏలూరు: ఆసుపత్రి పైనుంచి పడి రోగి మృతి

image

ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వేమూరి సత్యనారాయణ(40) అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. సత్యనారాయణ ఆసుపత్రి భవనంపై నుంచి కింద పడి ఉండటాన్ని అక్కడి వారు మంగళవారం గుర్తించారు. వెంటనే మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 5, 2024

ఏలూరులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

image

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బిర్లా భవన్ సెంటర్‌లో ఉన్న ఓ మెడికల్ షాప్ దగ్ధం అయింది. ఈ ఘటనలో షాపులోని మందులన్నీ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా..? మరేదైనా కారణమా..? తెలియాల్సి ఉంది.

News July 5, 2024

కుటుంబ తగాదాలు.. గోదావరిలో దూకి సూసైడ్

image

దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మెరిపో కిషోర్(33) గురువారం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్.. రోడ్డు కం రైలు వంతెనపై మోటారు సైకిల్, చెప్పులు విడిచిపెట్టి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి మృతదేహం లభ్యమైంది.

News July 4, 2024

ఖత్తర్‌లో మృతిచెందిన ప.గో. జిల్లావాసి

image

ప.గో. జిల్లా పోడూరు మండలం గుమ్ములూరు గ్రామానికి చెందిన షేక్ బాషా, కుమారుడు వలీ ఉపాధి నిమిత్తం ఖత్తర్ దేశం వెళ్లారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి వారు నివసిస్తున్న గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో షేక్ బాషా (46) మృతి మృతి చెందగా కుమారుడు వలీ చేతులు కాలిపోగా అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.