News February 1, 2025
ఏలూరు: ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు: ఆర్ఐవో
ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 1, 3న ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని RIO చంద్రశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఫిబ్రవరి 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 18,453 విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే (137) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్ పాస్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు.
Similar News
News February 1, 2025
HYDలో హృదయవిదారక ఘటన
HYDలోని వారాసిగూడ PSపరిధిలో <<15323241>>ఇంట్లో తల్లి మృతదేహంతో<<>> ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.
News February 1, 2025
చరిత్ర సృష్టించనున్న నిర్మల
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.
News February 1, 2025
MNCL: ‘మీవి ఖాళీ భూములా.. సోలార్ ప్లాంట్ వేసుకోండి’
బంజరు, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ కోరారు. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను టీజీఆర్ఈసీ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం టీజీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తుందన్నారు. వివరాలకు 6304903933, 9000550974 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.