News March 19, 2024

ఏలూరు: ఎన్ని విగ్రహాలకు ముసుగులేశారంటే ..!

image

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. 883 వాల్‌రైటింగ్స్, 5,717 పోస్టర్లు, 5,634 బ్యానర్లు, 2,140 హోర్డింగ్స్ మొత్తం 14,374 తొలగించడం జరిగిందని అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేతలు, పార్టీలకు సంబంధించి.. 2,697 విగ్రహాలకు ముసుగుతో పాటు ప్రైవేట్ ప్రదేశాలలో ఉన్న 558 వాల్ రైటింగ్స్, 3,778 పోస్టర్లు, 2,981 బ్యానర్లు, 1,480 హోర్డింగ్స్ మొత్తం కలిసి 8,797 తొలగించామన్నారు.

Similar News

News April 19, 2025

భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.

News April 19, 2025

ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 19, 2025

ప.గో: జేసీ హెచ్చరికలు 

image

షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

error: Content is protected !!