News March 10, 2025
ఏలూరు: కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం

ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రీ సెల్వీ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత సోమవారం వరకు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండలాల పరిధిలో ఈ కార్యక్రమం రద్దు చేశారు. కోడ్ ముగియడంతో ఈ సోమవారం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయిలో యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Similar News
News December 12, 2025
కామారెడ్డి: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

కామారెడ్డి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రెండో విడతలో లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహ్మద్నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.
News December 12, 2025
వైవాహిక అత్యాచారం నేరమే: శశి థరూర్

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా చూడకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. భార్యపై భర్త అత్యాచారాన్ని నేరంగా పరిగణించని దేశాలలో భారత్ ఒకటని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. కఠినమైన అత్యాచార చట్టాలు అమలులో ఉన్నా భర్తలకు మినహాయింపు దారుణమని కోల్కతాలో FICCI లేడీస్ ఆర్గనైజేషన్తో కలిసి ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రోగ్రామ్లో ఇలా వ్యాఖ్యానించారు.
News December 12, 2025
ఇంటి చిట్కాలు మీకోసం

* గుడ్డులోని సొన కింద పడితే ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మరక ఆనవాళ్ళు ఉండవు.
* గాజు వస్తువులపై ఉప్పు చల్లి నీళ్ళతో రుద్దితే కొత్తగా మెరిసిపోతాయి.
* ఇనుప వస్తువులను ఉప్పుతో రుద్ది పొడి క్లాత్తో తుడిచి భద్రపరిస్తే ఎక్కువకాలం మన్నుతాయి.
* నిమ్మరసం, ఉప్పుతో రాగిసామగ్రిని రుద్దితే మెరిసిపోతాయి.
* చీమలు వచ్చే రంధ్రం దగ్గర కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే వాటి బెడద తగ్గుతుంది.


