News September 19, 2025
ఏలూరు: కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన పద్మశ్రీ

ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా చైర్ పర్సన్ పద్మశ్రీ శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. పంచాయతీ రాజ్ శాఖ, పారిశుద్ధ్య శాఖ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లు పద్మశ్రీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె కలెక్టర్ను కోరారు. ప్రభుత్వాసుపత్రికి వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News September 19, 2025
KMR: TLM మేళాలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాగరాజు

కామారెడ్డి జిల్లా FLN TLM మేళా ప్రదర్శనలో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో SGT ఉపాధ్యాయుడు దాసరి నాగరాజు(Spl.Edu) ఉత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. దోమకొండ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయన వెనుకబడిన విద్యార్థులకు మెళుకువలు నేర్పేలా బోధనాభ్యాసన సామర్థ్యాలను తయారు చేశారు. ఈ మేరకు DEO రాజు ప్రశంసాపత్రం అందించారు.
News September 19, 2025
ASIA CUP: భారత్ స్కోర్ ఎంతంటే?

ఒమన్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును ఆగనివ్వలేదు. శాంసన్ 56, అభిషేక్ 38, తిలక్ 29, అక్షర్ 26 రన్స్ చేశారు. ఒమన్ బౌలర్లలో ఫైజల్, కలీమ్, జితెన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. మరి ఒమన్ను IND ఎన్ని పరుగులకు కట్టడి చేస్తుంది? COMMENT
News September 19, 2025
SC అభ్యర్థులకు TSLPRB గుడ్న్యూస్!

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే SC అభ్యర్థులకు TSLPRB ఊరటనిచ్చింది. కొత్త సబ్-క్లాసిఫికేషన్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో ప్రస్తుతానికి పాత వాటితోనే అప్లోడ్ చేయొచ్చని తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్తవి సమర్పించాలంది. లేకపోతే రిజర్వేషన్ వర్తించదని హెచ్చరించింది. OCT 5 చివరి తేదీ కాబట్టి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.