News March 11, 2025
ఏలూరు: కానిస్టేబుల్ ఒంటిపై 9 చోట్ల కత్తి గాయాలు

సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఐడి పార్టీ కానిస్టేబుల్గా పని చేస్తున్న నరేశ్పై అంతర్ రాష్ట్ర దొంగగా గుర్తించబడిన సురేందర్ కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సురేందర్ ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. అటు నరేశ్ శరీరంపై మొత్తం 9 చోట్ల కత్తితో చేసిన గాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 15, 2025
ఏలూరు SP ‘స్పందన’లో 38 ఫిర్యాదులు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందినట్లు వివరించారు. ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఎక్కవ ఫిర్యాదులు అందినవని తెలిపారు.
News December 15, 2025
జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్గా గెలుపు

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.
News December 15, 2025
మూడో విడత ఎన్నికలకు సిద్ధం చేయాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో ఆమె జూమ్ సమావేశం నిర్వహించారు. మూడో విడతలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు.


