News October 1, 2024

ఏలూరు: కాలువలో బాలుడి మృతదేహం లభ్యం

image

ఏలూరులో చెల్లి పుట్టిన రోజు వేడుకల్లో పేరెంట్స్, బంధువులు మందలించారని పదో తరగతి విద్యార్థి పోలినాయుడు(16) ఆదివారం <<14229870>>కాలువలో దూకిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. బాలుడి మృతదేహం లభ్యమైంది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు, కుమార్తె సంతానం. కుమార్తె పుట్టిన రోజు నాడే కుమారుడు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News October 1, 2024

భీమవరంలో యువకుడి ఆత్మహత్య

image

భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

News October 1, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. భీమవరం మహిళను మోసం చేసిన HYD వాసి

image

ప.గో జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ‌ను HYDకు చెందిన కృష్ణమోహన్ ఉద్యోగం పేరిట మోసం చేసినట్లు SI రెహమాన్ సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సదరు మహిళ, కృష్ణమోహన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులయ్యారన్నారు. తన తమ్ముడికి ఉద్యోగం కావాలని ఆమె కోరగా.. అదే ఛాన్స్‌గా తీసుకొని కృష్ణమోహన్ విడతల వారీగా రూ.1,08,000 నగదు తీసుకున్నాడు. మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News October 1, 2024

నరసాపురం: రాష్ట్రస్థాయి పోటీలకు 48 మంది ఎంపిక

image

నరసాపురం మండలం ఎల్బీచర్ల అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అండర్-14, 17 రగ్బీ పోటీలకు బాల, బాలికల ఎంపికలు జరిగాయి. ప.గో. జిల్లా వ్యాప్తంగా 110 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ పీఎస్ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు. మొత్తంగా 48 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని, వారు త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.