News September 11, 2024
ఏలూరు: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

నిడదవోలు పట్టణంలోని బసిరెడ్డిపేట రేవు వద్ద మంగళవారం రాత్రి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన పి.రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. గ్రామం నుంచి గణేశ్ విగ్రహాన్ని పట్టణంలో రేవుకు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుండగా గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు.
Similar News
News September 18, 2025
సంచలన చిత్రం మిరాయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండి కుర్రాడే

హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉండి గ్రామానికి చెందినవారు. గ్రామ కరణం తాడికొండ లక్ష్మీ నరసింహం మనవడైన గౌర హరి, తన సంగీత ప్రతిభతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. 8చిత్రాలకు పైగా సంగీతం అందించగా, వీటిలో హనుమాన్, మిరాయ్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. గౌర హరిది ఉండివాడు కావడం గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
News September 18, 2025
భీమవరం: 5 బార్లను లాటరీ

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.
News September 18, 2025
పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.