News March 26, 2025
ఏలూరు: గోవిందుడిని దర్శించిన గోమాత

నిడమర్రు మండలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనార్థం కోసం ఉదయాన్న వచ్చిన గోమాతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నిడమర్రు గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గోమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్లటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Similar News
News February 21, 2026
సంగారెడ్డి: అధికారులు సమన్వయంతో కృషి చేయాలని: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.
News February 21, 2026
మహిళలకు ఫ్రీ బస్.. రూ.50 చెల్లిస్తేనే!

TG: RTCలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌరసరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకొని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5L మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. కార్డులు లేని వారు ఆధార్తో ఫ్రీ జర్నీ చేయవచ్చు. బస్పాస్/మీ-సేవా సెంటర్లలో ₹50 చెల్లించి కార్డు తీసుకోవాలని తెలుస్తోంది.
News February 21, 2026
కర్నూలు: ఫేస్బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

ఫేస్బుక్ పరిచయంతో మహిళపై వ్యామోహం పెంచుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పత్తికొండలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అశోక్(26)కు పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్లో భాగస్వాములు కావాలని నమ్మబలికిన యువకుడు పత్తికొండకు వచ్చాడు. అనంతరం తనతో రావాలంటూ మహిళను వేధించగా ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.


