News September 6, 2025
ఏలూరు: ఛార్టర్డ్ అకౌంటెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ 2024-25 అభివృద్ధి పనుల్లో భాగంగా ఉపాధి హామీ పథకం అమలు, అకౌంట్ల ఆడిట్ కోసం ఛార్టర్డ్ అకౌంటెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల వారు దరఖాస్తులు, అర్హత పత్రాలను 12వ తేదీ సాయంత్రం 5 లోపు ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్కు పంపాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘుబాబు తెలిపారు.
Similar News
News September 7, 2025
నల్గొండ కలెక్టర్ చొరవ.. భారీగా దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో జాతీయ కుటుంబ సంక్షేమ పథకానికి స్పందన లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో పెద్ద ఎత్తున బాధిత కుటుంబాలు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల్లోనే 12,740 దరఖాస్తులు వచ్చాయి. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద మరణిస్తే ఆ ఇంటికి రూ.20వేల తక్షణ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.
News September 7, 2025
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లైవ్ చికెన్ kg ధర రూ.160 నుంచి 180 కాగా.. స్కిన్ చికెన్ కేజీ ధర రూ.190 నుంచి రూ.210 మధ్యగా ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం స్వల్పంగా ధరలు పెరిగినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు.
News September 7, 2025
గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

గణేష్ నిమజ్జనానికి పక్కడ్బందీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బీబీనగర్లోని పెద్ద చెరువు వద్ద ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అందరిని సమన్వయం చేస్తూ నిమజ్జన కార్యక్రమాలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.