News February 25, 2025
ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు ఎందరంటే?

ఈ నెల 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం.వరకు జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఉమ్మడి ఉభయ గోదావరిలో 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 456 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉన్నారని, 66 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. మంగళవారం సాయంత్రం 4.గంటల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు.
Similar News
News December 19, 2025
నేటి ముఖ్యాంశాలు

❁ AP: చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
❁ ‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్
❁ వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్
❁ గతేడాదితో పోలిస్తే ఏపీలో నేరాలు తగ్గుముఖం: DGP
❁ TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్
❁ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. 1,370 మంది అభ్యర్థులు ఎంపిక
❁ KCR అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: KTR
❁ SMAT విజేతగా ఝార్ఖండ్
News December 19, 2025
మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

నిర్వహణ లోపం వల్ల కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.
News December 19, 2025
రాజమండ్రి: ‘క్లాట్’ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి ప్రభంజనం

రాజమండ్రి శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థలు ‘క్లాట్’ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సంస్థకు చెందిన డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ విద్యార్థిని ఎస్. శ్రీ సాయి గీతిక జాతీయ స్థాయిలో 3వ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో 100 లోపు ముగ్గురు, 500 లోపు 12 మంది ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు.


