News September 6, 2024
ఏలూరు జిల్లాలో కి‘లేడీ’.. విలాసాల కోసం చోరీల బాట

ఏలూరు జిల్లా భీమడోలులో ఓ కి‘లేడీ’ని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రావణ్ వివరాల ప్రకారం.. గుండుగొలనులోని YSR కాలనీకి చెందిన శ్రీదేవి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టింది. కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతోంది. దీనిపై ఫిర్యాదులు అందగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రూ 4,47,000/- విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News February 6, 2026
వాడి వేడిగా ఆచంట రాజకీయం (1/2)

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తీరుకు దీటుగా వైసీపీ సర్పంచ్లు సవాలు విసురుతున్నారు. గతంలో తమపై ఆంక్షలు విధించారన్న అసంతృప్తితో సర్పంచ్లు ప్రతిఘటిస్తుండటంతో.. అక్కడ అధికార, ప్రతిపక్షాల నడుమ హోరాహోరీ వాతావరణం నెలకొంది.
News February 6, 2026
ఆచంటలో ఏం జరుగుతోంది (2/2)

<<19068550>>ఆచంటలో<<>> రాజకీయం వేడెక్కింది. గతంలో హవా నడిపిన ముగ్గురు వైసీపీ సర్పంచ్ల పంచాయతీ రికార్డులపై ఎమ్మెల్యే పితాని దృష్టి సారించారు. పరిపాలనలో ఎమ్మెల్యే పగ్గాలు బిగించడాన్ని జీర్ణించుకోలేని సదరు నేతలు ఇప్పుడు అధికార పక్షంపై ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే తీరును ఎండగడుతుండటంతో రాజకీయ వాతావరణం వాడివేడిగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇరువర్గాల బలనిరూపణకు వేదికగా నిలవనున్నాయి.
News February 6, 2026
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్: జడ్జి సికిందర్

తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాష తెలిపారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న మనోవర్తి, గృహహింస, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులతో పాటు బ్యాంకు, టెలిఫోన్ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర పరిష్కారం పొందాలని కోరారు.


