News March 21, 2025

ఏలూరు జిల్లాలో నలుగురు మృతి

image

ఏలూరు జిల్లాలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెంది ఏలూరుకి చెందిన మల్లేశ్వరరావు(40) ఉరి వేసుకున్నాడు. చింతలపూడిలో రిటైర్డ్ ఉద్యోగి హేమ ప్రకాశ్(65) అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా(D) వేల్పూరికి చెందిన రవికుమార్ మృతి చెందాడు. భీమడోలు వద్ద రైలు నుంచి జారిపడి సుబ్బారెడ్డి(69) అనే వ్యక్తి చనిపోయాడు.

Similar News

News September 17, 2025

GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

image

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News September 17, 2025

నల్గొండ: భూస్వామ్య కుటుంబంలో పుట్టి వారినే ఎదిరించాడు

image

నిజాం అనుచరులను ఎదిరించడంలో వేములపల్లి (M) రావులపెంట దళం ప్రధాన పాత్ర పోషించింది. అక్రమ వసూళ్లు, హత్యలు,అత్యాచారాలతో విసిగిన ప్రజలు తిరగబడ్డారు. రావులపెంట భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సీతారాంరెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేసి దాడులు చేశారు. గ్రామంలోని కోటబురుజును కేంద్రంగా చేసుకొని పాములపాడు, ఆమనగల్లులో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను తరిమికొట్టారు.

News September 17, 2025

భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం వివరాలివే!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 205.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ 39.4, పలిమెల 10.6, మహముత్తారం 18.6, కాటారం 34.8, మల్హర్ 3.6, చిట్యాల 8.2, టేకుమట్ల 26.8, మొగుళ్లపల్లి 11.0, రేగొండ 11.4, గణపురం 14.8, భూపాలపల్లి 26.2 మి.మీ.లుగా నమోదైంది.