News February 26, 2026
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

ఏలూరు జిల్లావ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,357 మంది విద్యార్థులకు గాను 15,972 మంది హాజరుకాగా, 385 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 98 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి.
Similar News
News February 28, 2026
హైదరాబాద్లో ఇక ఒకే చట్టం: సీఎం ఆదేశాలు

ఓఆర్ఆర్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సీఎం సమీక్షించారు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేసి, అనుమతులు, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తేవాలని చెప్పారు.
News February 28, 2026
హైవేపై బండి ఆగిపోయిందా? ఇలా చేయండి!

నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు మీ వాహనంలో పెట్రోల్ అయిపోయిందా? అలాంటి సమయంలో మీకు హెల్ప్ చేసేందుకు NHAI సిబ్బంది ఉన్నారనే విషయం మీకు తెలుసా? టోల్ ఫ్రీ నంబర్ ‘1033’కు కాల్ చేస్తే నిమిషాల్లోనే హెల్పింగ్ టీమ్ మీ వద్దకు చేరుకుంటుంది. డబ్బులు చెల్లించి 5 లీటర్ల వరకు పెట్రోల్/ డీజిల్ పొందవచ్చు. అలాగే ఇతర అత్యవసర సేవలు కూడా అందజేస్తారు. అన్ని రకాల వాహనాలకు ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. SHARE IT
News February 28, 2026
చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.


