News March 24, 2024
ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్ను విధుల నుండి తొలగించామని తెలిపారు.
Similar News
News March 15, 2025
తాడేపల్లిగూడెం చేరిన తండ్రి, పిల్లల మృతదేహాలు

కాకినాడ సుబ్బారావు నగర్లో తన ఇరువురు <<15765374>>పిల్లల్ని<<>> చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో తండ్రి వానపల్లి చంద్ర కిషోర్, పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) భౌతిక కాయాలు శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకున్నాయి. ఓఎన్జీసీ అంబులెన్స్ లో వారి భౌతిక కాయాలను తాడేపల్లిగూడెం పట్టణం పాతూరు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వెనుక ఉన్న మృతుడు చంద్రకిషోర్ తండ్రి సూరిబాబు నివాసానికి తీసుకొచ్చారు.
News March 15, 2025
భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.
News March 15, 2025
తణుకు: సీఎం సభలో కీ పాయింట్స్.

తణుకులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులో కొన్ని కీ పాయింట్స్…
1) పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార్క్ శుభ్రం చేశారు.
2) మార్కెట్ వ్యాపారస్తులతో ముఖాముఖి.
3) రాగి పిండితో తయారుచేసిన కప్పులను తిలకించారు.
4) తణుకులో 42 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
5) అక్టోబర్ 2న చెప్పకుండా వస్తా అన్నారు.
6) ప్రకృతిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్.