News March 24, 2024

ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

image

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్‌ను విధుల నుండి తొలగించామని తెలిపారు.

Similar News

News February 21, 2026

ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

image

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.