News March 19, 2025
ఏలూరు జిల్లాలో రూ.13,277 కోట్లు రుణాలు

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ వరకు రూ.6,639 కోట్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అందించారని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ.15,778 కోట్లకు ఇంతవరకు 13,277 కోట్లు రుణాలు అందించారని, మార్చి చివరినాటికి 100% లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం సీడీ రేషియో ప్రమాణం కనీసం 60% ఉండాల్సి ఉండగా, జిల్లాలో ఇది 199%గా ఉండటం మంచి పరిణామమన్నారు.
Similar News
News March 20, 2025
ASF: గంజాయి పట్టివేత.. నిందితుడిపై కేసు

తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామానికి చెందిన మెంద్రపు చిన్నయ్య ఇంట్లో 875 గ్రాముల గంజాయిని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు చిన్నయ్య ఇంట్లో తనిఖీ చేశామన్నారు. సుమారు రూ.21 వేల విలువైన గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. గంజాయిని సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 20, 2025
బడ్జెట్లో ములుగు జిల్లా ప్రజలకు నిరాశే!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ములుగు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన ములుగు పట్టణ అభివృద్ధి యాక్షన్ ప్లాన్కు బడ్జెట్లో చోటు దక్కలేదు. జిల్లాలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం యువత నిరాశకు లోనయ్యారు.
News March 20, 2025
పన్ను వసూళ్ళలో హుజూరాబాద్కు మొదటిస్థానం

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అధికార్లు, సిబ్బంది ముందు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా పని చేయటం వల్ల ఈ విజయం సాధించామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.