News August 23, 2025
ఏలూరు జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు: కలెక్టర్

జిల్లాలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కలెక్టర్ వెట్రిసెల్వి మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియజేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్షించారు. ఎరువుల అక్రమ రవాణాను నివారించడానికి ఇతర జిల్లాల, రాష్ట్రాల చెక్ పోస్ట్ల వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
Similar News
News April 13, 2026
WGL: బర్త్డేలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు..!

నర్సంపేటలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు.
News April 13, 2026
సిద్దిపేట: గొర్రెల కాపరి కూతురి సత్తా..!

బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన గొడ్డటి కోమల ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వర్గల్లో సోషల్ వెల్పేర్ పాఠశాలలో చదువుతున్న ఆమె ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. గొర్రెల కాపరి అయిన లచ్చయ్య కుమార్తె కోమల, పేదరికాన్ని జయించి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోమల విజయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
News April 13, 2026
రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


