News December 23, 2025
ఏలూరు జిల్లాలో 92.93 శాతం మందికి పోలియో చుక్కలు

ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గీతాబాయి తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు బూత్లలోనూ, ఇంటింటికీ తిరిగి చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1,87,204 మంది చిన్నారులకు గాను, 1,73,975 (92.93%) మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News December 29, 2025
ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.
News December 29, 2025
ప.గో: దర్శనానికి వేళాయె.. ఏడాదికోకసారి లభించే భాగ్యం

ద్వారకాతిరుమల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా గిరిప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం 5 కిలోమీటర్ల మార్గంలో ఎండుగడ్డి, టెంట్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గం: నుంచి ఏడాదికొకసారి లభించే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది.
News December 29, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


