News February 24, 2026

ఏలూరు జిల్లాలో 98 శాతం ఇంటర్ పరీక్షలు

image

ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్‌ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 26, 2026

పోలవరం: రిజర్వాయర్‌లో మునిగి వృద్ధురాలు మృతి

image

గంగవరం మండలం మొల్లేరు గ్రామానికి చెందిన కృష్ణవేణి బుధవారం సూరంపాలెం రిజర్వాయర్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకయ్య మీడియాకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా మతిస్తిమితం లేకుండా ఉంటున్న ఆమె పలు మార్లు ఇంటి నుంచి వెళ్లి పోవడం, కుటుంబ సభ్యులు వెతికి ఇంటికి తీసుకురావడం జరిగేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News February 26, 2026

NIT వరంగల్‌లో 39 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

NIT వరంగల్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News February 26, 2026

గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

image

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.