News March 14, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷జనసేన జయకేతనం ఆవిర్భావ సభకు పిఠాపురం తరలి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు, కార్యకర్తలు
✷హోలీ సందర్భంగా రంగులు చిమ్ముకొని ఎంజాయ్ చేసిన జిల్లా వాసులు
✷జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుబ్బల మంగమ్మ, రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర కార్యక్రమాలు
✷మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు
✷స్మార్ట్ మీటర్లను బిగించవద్దు: సీపీఐ
Similar News
News March 15, 2025
భారత్కు రావొద్దని నన్ను బెదిరించారు: వరుణ్ చక్రవర్తి

2021 టీ20 వరల్డ్ కప్లో ప్రదర్శన అనంతరం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘స్వదేశానికి రావొద్దని నన్ను బెదిరించారు. చెన్నై వచ్చాక కూడా ఎవరో నన్ను ఇంటివరకూ ఫాలో అయ్యారు. అది నాకు చాలా కష్టమైన దశ. నమ్మకంతో జట్టుకు సెలక్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చాలా బాధపడ్డాను’ అని గుర్తుచేసుకున్నారు.
News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
News March 15, 2025
ధనికులుగా మారేందుకు హర్ష్ గోయెంకా చిట్కాలు

ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారేందుకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా Xలో చెప్పిన టిప్స్ వైరలవుతున్నాయి.
* సంపదను సృష్టించే ఆస్తులను సంపాదించండి
* సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయండి
* ఆదాయంతో పాటు సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టండి
* ఆర్థిక ఐక్యూను మెరుగుపరచుకొండి
* సంపదను పెంచే అవకాశాలను చూడండి
* మనీ కోసమే కాకుండా నేర్చుకునేందుకు పనిచేయండి