News March 14, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷జనసేన జయకేతనం ఆవిర్భావ సభకు పిఠాపురం తరలి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు, కార్యకర్తలు
✷హోలీ సందర్భంగా రంగులు చిమ్ముకొని ఎంజాయ్ చేసిన జిల్లా వాసులు
✷జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుబ్బల మంగమ్మ, రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర కార్యక్రమాలు
✷మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు
✷స్మార్ట్ మీటర్లను బిగించవద్దు: సీపీఐ
Similar News
News March 29, 2026
ఏలూరు: ప్రేమకు తండ్రి నో.. యువతి క్షణికావేశం

ఏలూరు చెంచుల కాలనీకి చెందిన మోరు పావని(23) డిగ్రీ చదివి ఉద్యోగానికి ప్రయత్నిస్తోంది. ఈనెల 25న తాను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పింది. తండ్రి అందుకు నిరాకరించాడు. ఈనెల 26న తమ సొంత బిల్డింగ్పై నుంచి దూకింది. తల్లిదండ్రులు ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పావని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 29, 2026
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే..

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
*ఆహారం త్వరగా విచ్ఛిన్నమై జీర్ణక్రియ వేగవంతం అవుతుంది
*క్యాలరీలు త్వరగా కరుగుతాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
*శరీరంలోని టాక్సిన్స్ (విష పదార్థాలు) బయటకు వెళ్లిపోతాయి
*ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది
*చర్మంపై ముడతలు తగ్గి ఆరోగ్యకరంగా మారుతుంది.
News March 29, 2026
MDCL: అక్రిడేషన్ కార్డు.. ఆప్లైకి APR 6 తుది గడువు

రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు. జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కట్టింగులు, విద్యార్హతల సర్టిఫికెట్లు, సంబంధిత అర్హత పత్రాలతో అప్లై చేసుకోవాలన్నారు.


