News January 4, 2026
ఏలూరు జిల్లా ప్రజలకు గమనిక

ఏలూరు కలెక్టరేట్, మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు https://meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. వాటి స్థితిని 1100 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News February 12, 2026
1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
News February 12, 2026
నంద్యాల: ఎదురు చూపులు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా కొత్త పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వితంతువులతో పాటు వృద్ధాప్య, కళాకారులు, ఇతర పింఛన్లకు అర్హత కలిగిన సుమారు 6 వేలకు మందిపైగా ఉన్నారు. వారంతా నూతన పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని అర్హత కలిగిన లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News February 12, 2026
సంగారెడ్డి: ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో!

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో ఎవరీ అదృష్టం వరిస్తుందో తెలియాలి అంటే 13న కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.


