News December 4, 2025
ఏలూరు జిల్లా రైతులకు రూ.213.31కోట్ల ఆర్థికసాయం

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ‘రైతన్న మీకోసం’ వర్క్షాప్లో పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో రెండు విడతల్లో లక్షా 60 వేల 968మంది రైతులకు రూ.213.31 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించామని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
KMR: నేటి నుంచి రెండో విడుత నామినేషన్ల ఉపసంహరణ

కామారెడ్డి జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అధికారులు బుధవారం పరిశీలించి స్ర్కూటినీ పూర్తి చేశారు. గురువారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానుంది. DEC 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ గడువు ముగియనుంది. నామినేషన్ వేసిన వారిలో ఎంతమంది పోటీలో ఉంటారు, ఎవరు నామినేషన్లను ఉపసంహరించుకుంటారో? అనేది ఆసక్తిగా మారింది.
News December 4, 2025
KMR: నేటి నుంచి రెండో విడుత నామినేషన్ల ఉపసంహరణ

కామారెడ్డి జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అధికారులు బుధవారం పరిశీలించి స్ర్కూటినీ పూర్తి చేశారు. గురువారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానుంది. DEC 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ గడువు ముగియనుంది. నామినేషన్ వేసిన వారిలో ఎంతమంది పోటీలో ఉంటారు, ఎవరు నామినేషన్లను ఉపసంహరించుకుంటారో? అనేది ఆసక్తిగా మారింది.
News December 4, 2025
డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం


