News April 9, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న లోక్ అదాలత్ 

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల సముదాయాల్లో మే 10న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాదు కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు కేసులు పరిష్కారించుకోవచ్చన్నారు. 

Similar News

News February 24, 2026

ఆదిలాబాద్: లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

image

జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు ఎక్కువ పరిష్కరించేలా దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్ రావు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు హల్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

News February 24, 2026

ఆదిలాబాద్: కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పాలన అధికారులు

image

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.

News February 24, 2026

ఇంగ్లండ్‌తో పోరు.. పాక్ స్కోరు ఎంతంటే..?

image

T20 WC సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 164-9 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(63) రాణించగా, బాబర్ ఆజమ్(25), ఫఖర్ జమాన్(25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, ఓవర్టన్, ఆర్చర్ తలో 2, రషీద్ ఒక వికెట్ తీశారు.