News March 5, 2025

ఏలూరు: జీవీ సుందర్‌కు 16,183 ఎక్కువ ఓట్లు

image

ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. వీరి తర్వాత మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాజశేఖర్‌కు 1,24,702 ఓట్లు రాగా, వీరరాఘవులకు 47,241, జీవి సుందర్‌కు 16,183 ఓట్లు వచ్చాయి. 

Similar News

News July 7, 2025

విజయనగరం జిల్లాలో కూలిన వంతెన

image

సంతకవిటి మండలం కొండగూడెం-ఖండ్యాం మధ్య సాయన్నగెడ్డపై ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీనితో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, బూర్జ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్‌కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

News July 7, 2025

సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

image

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News July 7, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.