News November 10, 2025

ఏలూరు: ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఏలూరు జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యం కనీస మద్దతు ధర ‘గ్రేడ్-ఎ’ రకం క్వింటాల్‌కు రూ.2,389, కామన్ రకం రూ.2,369 చొప్పున నిర్ణయించినట్లు సివిల్ సప్లై మేనేజర్ శివరామమూర్తి సోమవారం తెలిపారు. జిల్లాలో 234 రైతు సేవా కేంద్రాలు, 102 ఏజెన్సీల ద్వారా దాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా 18004256453, 7702003584 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Similar News

News November 11, 2025

జిల్లాలో కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలి: జేసీ

image

ఈ నెల 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్నారు.

News November 11, 2025

HYD: బైక్‌లపై వచ్చి ఇంటింటా ‘ఓటు కవర్‌’ డెలివరీ!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేపు(మంగళవారం) బైపోల్ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉన్నప్పటికీ, బైక్‌లపై కొందరు పేపర్‌ బాయ్‌ తరహాలో బస్తీల్లోని ప్రతి ఇంటి వద్దకు వచ్చి, డబ్బు, గుర్తుతో ఉన్న ఎన్వలప్ కవర్లను విసిరేసి పోతున్నారు. ఓటు కోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది.

News November 11, 2025

HYD: బైక్‌లపై వచ్చి ఇంటింటా ‘ఓటు కవర్‌’ డెలివరీ!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేపు(మంగళవారం) బైపోల్ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉన్నప్పటికీ, బైక్‌లపై కొందరు పేపర్‌ బాయ్‌ తరహాలో బస్తీల్లోని ప్రతి ఇంటి వద్దకు వచ్చి, డబ్బు, గుర్తుతో ఉన్న ఎన్వలప్ కవర్లను విసిరేసి పోతున్నారు. ఓటు కోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది.