News April 1, 2025
ఏలూరు: పండుగ రోజుల్లో భారీగా చికెన్ అమ్మకాలు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో పలు చోట్ల కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. మరి మీ ప్రాంతంలో ధర ఎంతో కామెంట్ చేయండి.
Similar News
News December 13, 2025
TGCABలో ఇంటర్న్గా చేరాలనుకుంటున్నారా?

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (<
News December 13, 2025
వెల్టూర్: ఓటర్ల కాళ్లు మొక్కిన అభ్యర్థి

వెల్టూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బూషిరాజ్ మల్లయ్య ఇంటింటికీ తిరిగి ఓటర్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ప్రజాసేవకు సర్వం కోల్పోయానని, ఉన్న ఆరు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నానని చెబుతున్నారు. ఆడబిడ్డలు కలిగిన నేతను, ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రచారంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News December 13, 2025
తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన SP

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని SP డి.నరసింహ కిషోర్ శనివారం సందర్శించారు. త్వరలో స్టైపెండరీ క్యాడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.


