News February 3, 2025

ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..ఎస్పీ

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు ఇవ్వడానికి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

Similar News

News July 9, 2025

రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ

image

AP: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధుల విడుదలకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

News July 9, 2025

మంత్రులకు CM చంద్రబాబు వార్నింగ్!

image

AP: YCP దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని CM CBN సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని క్యాబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు YCP ఈ-మెయిళ్లు పెట్టించినట్లు మంత్రి కేశవ్ CM దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన CM.. YCP కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.

News July 9, 2025

ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

image

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.