News November 8, 2025
ఏలూరు: భక్త కనకదాసుకు నివాళులర్పించిన కలెక్టర్

భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్లో భక్త కనకదాసు జయంతి కార్యక్రమం జరిగింది. భక్త కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్త కనకదాసు విశిష్టమైన కవిగా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని కొనియాడారు. ఆయన రచనలు, కీర్తనలు ప్రజలకు భక్తిని మానవత్వాన్ని బోధించాయన్నారు.
Similar News
News November 8, 2025
మెదక్లో ముగిసిన జోనల్ స్థాయి మీట్

మూడు రోజులుగా మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో జరిగిన రాజన్న సిరిసిల్ల 11వ జోనల్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల పీడీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.
News November 8, 2025
జగిత్యాల: భూకబ్జా.. కలెక్టర్కు MLA లేఖ

జగిత్యాల కొత్త బస్ స్టాండ్ సమీపంలోని సర్వే నం.138లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఆ ప్రాంతంలో వ్యాపారాలు, పెట్రోల్ బంక్, బార్ నిర్వహణ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని MLA తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రుజువైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, ఇదే భూమిపై మాజీమంత్రి జీవన్ రెడ్డి సైతం లేఖ రాయడంతో చర్చ మొదలయింది.


