News February 4, 2025
ఏలూరు: భార్య మోసగించిందని ఉరేసుకున్న భర్త
జీవిత సర్వసమనుకున్న భార్యనే ప్రేమ పేరుతో మోసగిందిచింది. ఏలూరు తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన జోను సాయిదుర్గరావు (28) తాపీ పనులు చేస్తాడు. నువ్వంటే ఇష్టమన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఒక పాప ఉంది. యువతి మరో యువకుడిపై మోజుపడి అతనితో వెళ్లిపోవడంతో తట్టుకోలేని భర్త సోమవారం విరక్తి చెంది చున్నితో ఉరేసుకున్నాడు. టూటౌన్ సీఐ నాగ కళ్యాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 4, 2025
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News February 4, 2025
నెల్లూరు:ల్యాబ్ టెక్నీషియన్ల సమీక్షా సమావేశం
అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
News February 4, 2025
తిరుపతి SVU దగ్గర 144 సెక్షన్
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికారులకు సవాల్గా మారింది. నిన్ననే ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేక వాయిదా పడింది. తమ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేశారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. కార్పొరేటర్ల బస్సుకు భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరికాసేపట్లో ఎస్వీయూ దగ్గరకు కార్పొరేటర్లు రానున్నారు. ఈ నేపథ్యంలో SVU దగ్గర 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు.