News March 31, 2025
ఏలూరు: మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్రూమ్లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.
Similar News
News April 2, 2025
NZB: కవిత GHIBLI ఇమేజ్ చూశారా..

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్నంగా ప్రశ్నించారు. ఆడ పిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్తో ఇంస్టాగ్రామ్లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ ? అంటూ ఇంస్టాగ్రామ్లో స్కూటీ మీనియేచర్ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్ను కవిత పోస్ట్ చేశారు.
News April 2, 2025
మయన్మార్లో మరోసారి భూకంపం

మయన్మార్లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైంది. కాగా భూకంపం ధాటికి మయన్మార్లో ఇప్పటికే 2,700 మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. 4500 మందికిపైగా గాయాలపాలయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. రోడ్లపైనే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
News April 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.