News March 26, 2025
ఏలూరు: ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించారు.
Similar News
News February 28, 2026
సూర్యాపేటలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో మార్చి 1 నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందనీ ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. బాణాసంచా, DJలు నిషేధం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.
News February 28, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారా?

US, Israel దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీనిని ఇరాన్ వర్గాలు ఖండించాయి. తనకు తెలిసినంత వరకు ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ తెలిపారు. కాగా ఖమేనీ పరిస్థితిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు Israel దాడుల్లో ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నాసీర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.
News February 28, 2026
ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


