News March 23, 2024
ఏలూరు: రూ.2.59 లక్షలు సీజ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.59 లక్షలు సీజ్ చేసినట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్ కె.ఖాజావలి వెల్లడించారు.
Similar News
News April 25, 2025
యలమంచిలి: వ్యక్తిని దారుణంగా చంపిన దంపతులు

యలమంచిలి మండలం కొంతేరులో కత్తుల పౌలు(59) <<16199598>>హత్యకు గురైన సంగతి తెలిసిందే<<>>. ఈ కేసుపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న పౌలు, ఏసుదాసు కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. బుధవారం రాత్రి పౌలు ఇంటికి వెళ్లిన ఏసుదాసు మంచంపై నిద్రిస్తున్న పౌలుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇందుకు ఏసుదాసు భార్య భారతి కూడా సహకరించింది. నిందితులు ఏసుదాసు, భారతీలను అదుపులోకి విచారిస్తున్నారు.
News April 25, 2025
భీమవరం: విద్యార్థులను సత్కరించిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News April 24, 2025
భీమవరంలో యాంకర్ అనసూయ సందడి

భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.