News April 15, 2025
ఏలూరు: రైలు కిందపడి ఒకరు మృతి

గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిమెంటు రంగు చొక్కా, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. SI సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 6, 2025
గ్లోబల్ స్థాయిలో ‘రాజాసాబ్’ ప్రమోషన్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి సింగిల్, ప్రతి 10 రోజులకు కొత్త సాంగ్ విడుదల కానున్నట్లు పేర్కొన్నాయి. అలాగే క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ కూడా రానుందని పేర్కొన్నాయి.
News November 6, 2025
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి అత్యల్పంగా గోవిందారం, మన్నెగూడెంలో 18.4℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గొల్లపల్లి, పూడూర్, కథలాపూర్ 19, మద్దుట్ల 19.2, పెగడపల్లి 19.3, తిరుమలాపూర్ 19.4, మల్యాల, జగ్గసాగర్, రాఘవపేట 19.5, మల్లాపూర్, కోరుట్ల 19.6, నేరెళ్ల, రాయికల్, ఐలాపూర్ 19.7, గోదూరు, పొలాస, సారంగాపూర్ 19.8, మేడిపల్లి 19.9, జగిత్యాలలో 20.1℃గా నమోదైంది.
News November 6, 2025
వెట్ల్యాండ్లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్ల్యాండ్ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో వెట్ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.


