News August 15, 2025

ఏలూరు: వ్యవసాయ శాఖకు ప్రథమ బహుమతి

image

ఏలూరులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి స్టాల్స్‌ను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ సాధికారిక సంస్థ మొదటి బహుమతి, ఉద్యానవన శాఖ రెండో బహుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మూడో బహుమతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నాలుగో బహుమతి గెలుచుకున్నాయి.

Similar News

News August 15, 2025

విశాఖలో 250 మంది బిచ్చగాళ్లకు షెల్టర్

image

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 15, 2025

KNR: మద్యం అమ్మారు.. కేసు నమోదు చేశారు

image

KNR(D) తిమ్మాపూర్(M) అలుగునూర్‌లోని ఓ <<17416197>>షాపులో <<>>పంద్రాగష్టు రోజు మద్యం అమ్మిన విషయం తెలిసిందే. అయితే, తిమ్మాపూర్ SI శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.33,000 విలువగల మద్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. అక్రమమద్యం అమ్ముతున్న మంజయ్య, లక్ష్మణ్, లక్ష్మణ్‌‌పై కేసులు నమోదు చేశామని SI తెలిపారు. ఇలా ఎవరైనా చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసు నమోదుచేస్తామని హెచ్చరించారు.

News August 15, 2025

మేడ్చల్: ప్రోత్సాహక చెక్కులు అందించిన కలెక్టర్

image

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు చెక్కులు అందజేశారు. జానం సోనీ(579), చీకటి త్రివేణి(572), కుర్మ రాజ్ కుమార్(563), శీలంశెట్టి సాయి విఘ్నేశ్ (561)కి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 ప్రోత్సాహకం అందజేశారు. భవిష్యత్‌లో మరింత శ్రమించి ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.