News March 20, 2025

ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

image

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.

Similar News

News December 21, 2025

వ్యవసాయ రంగంతో కడప జిల్లాకు భారీ ఆదాయం.!

image

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 40.27 లక్షల క్వింటాల్ల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ప్రభుత్వానికి మార్కెట్ సెస్ రూపంలో రూ.7.09 కోట్లు రాబడి లభించింది. (రూ.లక్షల్లో) వరి-115.46, బియ్యం-25.12, వేరు శనగ-30.94, ప్రత్తి-94.77, ఉల్లి-13.29, పప్పు శనగ-16.91, కంది-1.19, బత్తాయి-13.73, పసుపు-92.90, మినుము-30.84, నువ్వులు-54.27, మొక్కజొన్న-62.86, ఇతర వాటినుంచి-157 రాబడి వచ్చింది.

News December 21, 2025

సోంపేట: చెరువులను కాపాడాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

image

సోంపేట పట్టణంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు జడ్పీటీసీ సభ్యురాలు యశోద శనివారం వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాసపురం సర్పంచ్ టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.

News December 21, 2025

స్లీవ్‌లెస్, చిరిగిన దుస్తులతో ఆఫీసుకు రావొద్దు!

image

హుందాగా ఉండే డ్రెస్సులతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతమంది సిబ్బంది అసభ్యకరంగా దుస్తులు ధరించారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేదు. కానీ కొందరు కాలేజీ యువత మాదిరి చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్, బిగుతైన దుస్తులు ధరిస్తున్నారు. ఇది సరికాదు. విధి నిర్వహణలో హుందాగా ఉండాలి’ అని DPAR విభాగం ఉత్తర్వులిచ్చింది.