News October 20, 2024

ఏలూరు: హైకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్ వెట్రి సెల్వి

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సురేశ్ రెడ్డి ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రి సెల్వి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం పలు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

Similar News

News October 20, 2024

ప.గో జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఖరారు

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారు చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం సందిగ్ధత నెలకొంది. దీంతో నేడు విడుదల చేసిన ప్రకటనతో ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిపై స్పష్టత వచ్చింది.

News October 20, 2024

ఏలూరు జిల్లాలో 11 మంది అరెస్ట్.. వారిలో ముగ్గురు పోలీసులు

image

ఏలూరు నగరంలోని శనివారపుపేటవై జంక్షన్లోని అబ్బిరెడ్డి అపార్టుమెంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు శనివారం తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. ఈ దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వారిలో వివిధ చోట్ల పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు ఉండటం గమనార్హం.

News October 20, 2024

భీమవరం: ‘ఇసుక సమస్యలపై టోల్ ఫ్రీను సంప్రదించండి’

image

ఉచిత ఇసుక పొందడానికి సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టెక్నికల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా కాల్ సెంటర్ టెక్నికల్ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక సాంకేతిక సమస్యలపై సమీక్షించారు. అనంతరం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 93914 45753, 86882 91997, 81869 39223, 95501 75144 సంప్రదించాలని సూచించారు.