News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఏలూరు హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

Similar News

News February 22, 2026

BREAKING: గజ్వేల్‌లో RTC బస్సుకు యాక్సిడెంట్

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలవగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే వారిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News February 22, 2026

పగలు ఎండ, రాత్రి ఠండా.. మధ్యలో వర్షాలు!

image

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాత్రిళ్లు చలిగాలులు వీస్తుండగా పగలు ఎండ దంచి కొడుతోంది. ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలోని నందిగామ, కర్నూలులో నిన్న 37డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండ వేడికి ఉక్కపోత మొదలైంది. ఇక వేసవి పూర్తిగా రాకముందే వర్షాలు ఎంటరవుతున్నాయి. అల్పపీడనం వల్ల నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

News February 22, 2026

NGKL: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం శివారు కృష్ణా నదీ తీరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వలస యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చేపల వేట కోసం వచ్చిన ఇతను రెండు రోజుల క్రితమే మరణించినా, అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.