News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఏలూరు హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

Similar News

News November 4, 2025

NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.

News November 4, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను పరిశీలించిన క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్‌తో నిఘా

News November 4, 2025

160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.