News January 30, 2025
ఏలేరు కాల్వలో కొనసాగుతోన్న గాలింపు

అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ వద్ద ఏలేరు కాల్వలోకి బొలెరో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంత మంది ఉన్నారనే విషయాలపై అనకాపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వాహనంలో మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 28, 2026
అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.
News February 28, 2026
అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.
News February 28, 2026
జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. 2025 భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న సంస్థల ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. కృష్ణ ఆగ్రో ఫ్యూయల్ , మై హోమ్ సిమెంట్స్, ఇండేన్ ఎనర్జీస్
సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి, భూసేకరణ అంశాలను సమీక్షించారు.


