News September 13, 2025

ఏలేశ్వరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఏలేశ్వరం డిగ్రీ కళాశాల సమీపంలో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు కళాశాల వద్దకు లేదా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, వివరాలను సేకరిస్తున్నారు.

Similar News

News September 13, 2025

గుడిమల్లంలో 22 నుంచి దసరా ఉత్సవాలు

image

పురాతన శైవక్షేత్రమైన గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 22న కలశ పూజ, 23న బాలాత్రిపుర సుందరి, 24న గాయత్రిదేవి, 25న అన్నపూర్ణ దేవి, 26న ఆనందవల్లి, 27న మహాలక్ష్మి దేవి, 28న లలితా త్రిపుర సుందరీ దేవి, 29న సరస్వతి దేవి, 30న దుర్గాదేవి, 1న మహిషాసుర మర్దిని, 2న రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనం ఉంటుంది.

News September 13, 2025

జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

image

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 13, 2025

నిండుకుండల శ్రీరామ్ సాగర్

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. శనివారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.501 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి భారీగా 1,08,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 23 గేట్లు ఎత్తి 91,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఐఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.