News October 9, 2024

ఏసీఏ టోర్నీలో విశాఖ జట్టు విజయం

image

ఏసీఏ అండర్ -14 క్రికెట్ టోర్నీలో విశాఖ జట్టు గెలుపొందింది. కడపలో జరిగిన మ్యాచ్‌లో తూ.గో. జిల్లా జట్టుపై విశాఖ ఘన విజయం సాధించింది. విశాఖ 68 ఓవర్లలో 426/3కి డిక్లేర్ చేయగా.. తూ.గో. జట్టు 50పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖ జట్టులో వినోద్ (177), రామ్ చరణ్(133)రన్స్ చేయగా.. ప్రఖ్యాత్ వర్మ 5వికెట్లు తీశారు.

Similar News

News October 9, 2024

విశాఖలో పెరిగిన విమాన ప్రయాణికులు

image

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జులైలో 1,720 విమానాల ద్వారా 2,25,261 మంది.. ఆగస్టులో 1,872 విమానాల్లో 2,52,311 మంది ప్రయాణించినట్లు ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబరులో 1,806 సర్వీసుల్లో 2,25,215మంది ప్రయాణించినట్లు వివరించింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 6.8శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

News October 9, 2024

స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ: ఎంపీ శ్రీభరత్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు.

News October 9, 2024

విశాఖ: ప్రయాణికులు భద్రతకు ప్రత్యేక చర్యలు

image

పండగ సీజన్ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణికులు సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక కోచ్‌లు జత చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్లు లేకుండా రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించరాదన్నారు. నిషేధిత వస్తువులను తీసుకువెళ్లవద్దన్నారు.