News October 9, 2025

ఏసీబీకి చిక్కిన చిట్యాల ఎమ్మార్వో

image

చిట్యాల తహశీల్దార్ కృష్ణ ఏసీబీకి చిక్కారు. భూమికి సంబంధించిన ధ్రువపత్రాల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అధికారులు ఆయన నివాసంలో ఆస్తుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Similar News

News October 10, 2025

CM పర్యటనకు 1250 మందితో బందోబస్త్: SP

image

1,250 మంది పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు ఎస్పీ అజిత తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా, పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

News October 10, 2025

తిరుపతి: PG ఫలితాలు వచ్చేశాయ్.!

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో (పీజీ) PG M.A హిస్టరీ, M.Sc బాటని/బయో కెమిస్ట్రీ/ జియాలజీ/ జువాలజీ/ బయోటెక్నాలజీ/ అంత్రపాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.

News October 10, 2025

పెద్దపల్లి: నిర్దిష్ట గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏటీసీ కేంద్రాల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పాఠశాలల భవన నిర్మాణం, పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. క్రిటికల్ కేర్ భవనం 15 రోజుల్లో పూర్తిచేసి అప్పగించాలని, సదరన్ క్యాంప్ వారం రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు.