News September 12, 2025
ఏ తల్లి నిను కన్నదో..!

ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. పసికందు ఏడుపులు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ICDS సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
వాళ్లు నన్ను చంపేస్తారు: ఇరాన్ హీరోయిన్

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం దిగిపోయేవరకు తాను ఆ దేశంలో అడుగుపెట్టలేనని సాక్రెడ్ గేమ్స్ ఫేమ్, ఇరానియన్ హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజీ అన్నారు. ఖమేనీ మృతి విషయం తెలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇరాన్ వెళ్తే చంపేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ఎనిమిదేళ్ల వయసులో ఆమె ఇరాన్ను వీడారు. తర్వాత యూరప్లో మోడలింగ్ నేర్చుకున్నారు. ప్రస్తుతం INDలోనే ఉన్నారు.
News March 3, 2026
ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

TG: బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రాన్ని BRS, INC అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు.
News March 3, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<


