News September 23, 2025

ఐఐఆర్ఎస్ఆర్ ఏర్పాటు ఇంకెప్పుడూ….?

image

టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసి ఎర్రచందనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మొక్కగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ 2022లో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎర్రచందన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంజూరు చేసినప్పటికీ, అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ల్యాబ్‌లో పరిశోధన దశలో ఉన్న ఎర్రచందనాన్ని రైతులు పెంచుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

Similar News

News September 23, 2025

బీటెక్, డిప్లొమా అర్హతతో 54 పోస్టులు

image

<>DRDO<<>> పరిధిలోని ఛాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ 54 ఇంజినీరింగ్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెలకు రూ.9వేల చొప్పున, డిప్లొమా విద్యార్థులకు రూ.8వేల చొప్పున స్టైపండ్ అందిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News September 23, 2025

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి: CM

image

TG: మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు. మేడారంలో మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః నిర్మాణం చేపట్టడం మాకు దక్కిన గొప్ప అవకాశం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం. రామప్ప ఆలయం స్ఫూర్తిగా రాతి కట్టడాలు నిర్మిస్తాం. కుంభమేళాకు ₹వేల కోట్లు కేటాయించిన కేంద్రానికి మేడారం జాతరపై వివక్ష ఎందుకు’ అని ప్రశ్నించారు.

News September 23, 2025

ఇక ఆ 29 సారా రహిత గ్రామాలు: కలెక్టర్

image

‘నవోదయం’ కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 8 మండలాల్లోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఓ మాధవి పాల్గొన్నారు.