News October 16, 2025

ఐక్యరాజ్య సమితి అధికారులతో పెద్దపల్లి MP భేటీ

image

PDPL MP వంశీ కృష్ణ గడ్డం ఐక్యరాజ్య సమితి, ACABQ ఛైర్‌పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, UN ఆర్థిక, బడ్జెట్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ చంద్రమౌళి రామనాథన్‌ను బుధవారం న్యూయార్క్‌లో కలిశారు. ఈ సమావేశంలో UN ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా శాంతి భద్రతా నిధులపై చర్చ జరిగింది. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ కీలక పాత్రను మన దేశ ప్రతినిధులు పునరుద్ఘాటించారు. పారదర్శకత, బాధ్యత, సమర్థతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Similar News

News October 16, 2025

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

image

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.

News October 16, 2025

UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం

image

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్‌షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్‌లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.

News October 16, 2025

నేటి నుండే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి 5వ జాతీయ స్థాయి అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో క్రీడా పోటీల ప్రాంగణం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 937 మంది అథ్లెట్లు 135 మంది టెక్నికల్ అఫీషియల్స్, కోచులు పాల్గొంటారు.