News September 20, 2024

ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలి: కలెక్టర్

image

వంద రోజులు, వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. 2024 నుంచి 2029 వరకు ఒక విజన్‌తో కూడిన నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి శాఖ వికసిత 2047 లక్ష్యసాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News February 13, 2026

‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

image

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

News February 13, 2026

అనంతపురం జిల్లాలో పదోన్నతులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.

News February 12, 2026

110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాల పంపిణీ

image

110 మంది గ్రామ రెవెన్యూ (గ్రేడ్-II) అధికారులు గ్రేడ్-Iగా పదోన్నతి పొందినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో 110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించి లక్ష్యసాధనలో సత్ఫలితాలు సాధించాలన్నారు.