News March 7, 2025
ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 9, 2025
ఎన్టీఆర్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోళీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా మాల్డా టౌన్(MLDT), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 18న MLDT- CHZ(నం.03430), ఈనెల 20న CHZ- MLDT(నం.03429) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గుంటూరుతో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 9, 2025
NLG: ఇంకా ప్రారంభం కానీ రేషన్ పంపిణీ!

నల్గొండ జిల్లాలో చాలాచోట్ల రేషన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. కనీసం సగానికిపైగా రేషన్ దుకాణాలకు బియ్యం కోటా అందలేదు. దీంతో లబ్ధిదారులకు ప్రతినెలా 1వ తేదీ నుంచి మొదలు కావాల్సిన బియ్యం పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లబ్ధిదారులు దుకాణాల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో పూర్తిస్థాయి రేషన్ పంపిణీకి మరో వారం నుంచి పది రోజులకు పైగానే పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
News March 9, 2025
చింతకాని : యువతి అదృశ్యం… కేసు నమోదు

చింతకానికి చెందిన ఓ యువతి ఈ నెల7 నుంచి కానరాకుండా పోవడంతో అమెతండ్రి ఫిర్యాదు మేరకుపోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు కోదాడకు చెందిన ఓ యువకుడితో గత నెల 24 నిశ్చితార్థం జరిగింది. పెళ్లికోసం ఇంట్లో దాచిన రూ. 2.50 లక్షలుతీసుకోని వెళ్లిపోగా, ఎక్క డ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.