News March 22, 2025

ఐపీఎల్‌లో అందరి దృష్టి కాకినాడ కుర్రాడి వైపే

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పండగ ప్రారంభమవుతుంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కుర్రాడు పెన్మత్స సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన కాకినాడకు చెందిన కుర్రాడు ఎలా ఆడతాడో వేచి చూడాలి.

Similar News

News November 7, 2025

ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

image

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.

News November 7, 2025

భారత రైతాంగ ఉద్యమపితామహుడు మన జిల్లావారే

image

రైతు జన బాంధవుడు ఆచార్య ఎన్.జీ.రంగా పొన్నూరులోని నిడుబ్రోలులో 1900 నవంబర్ 7న జన్మించారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1934లో రైతు ప్రతినిధిగా పార్లమెంటులో అడుగు పెట్టి 1991వరకు ఉభయ సభల్లో కొనసాగి, గిన్నిస్ బుక్ ఎక్కారు. నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరో రాజకీయ నాయకులను అందించారు.

News November 7, 2025

చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

image

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.